కశ్మీర్ వివాదం.. ట్రంప్ మధ్యవర్తిత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు! భారత్ వ్యతిరేకించినా ఆగని వాదన!
Wed Jun 11, 2025 15:10 U S A
కశ్మీర్ వివాదంలో బయటి వ్యక్తుల జోక్యాన్ని భారత్ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, అమెరికా మాత్రం ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ నిన్న వ్యాఖ్యానించారు. ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదన గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బ్రూస్ బదులిస్తూ "అధ్యక్షుడి మనసులో ఏముందో, ఆయన ప్రణాళికలేంటో నేను చెప్పలేను" అన్నారు. అయితే "అధ్యక్షుడు ట్రంప్ వేసే ప్రతి అడుగు దేశాల మధ్య దశాబ్దాల విభేదాలను, యుద్ధాలను పరిష్కరించడానికేనని మనందరికీ తెలుసు. కాబట్టి, ఆయన అలాంటి (కశ్మీర్) అంశాన్ని పరిష్కరించాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు" అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ "జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్య అయినా భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలన్నది మా సుదీర్ఘకాల జాతీయ విధానం. ఆ విధానంలో ఎలాంటి మార్పూ లేదు. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడమే ప్రస్తుతం మిగిలి ఉన్న అంశం" అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మీకు భూమి ఉందా.? బంగారాన్ని పండించొచ్చు.! మార్కెట్ పరిస్థితికి అనుగుణంగా..
పొరుగు దేశాలతో వివాదాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ తిరస్కరించడానికి 1972 నాటి తాష్కెంట్ ఒప్పందం కూడా ఒక ఆధారమని ఆయన గుర్తుచేశారు. ఇటీవల భారత పార్లమెంటరీ బృందం (శశి థరూర్ నేతృత్వంలో) డిప్యూటీ సెక్రటరీ లాండౌతో భేటీ అయినప్పుడు, ఉగ్రవాదంపై పోరులో భారత్కు అమెరికా బలమైన మద్దతును, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించిందని బ్రూస్ తెలిపారు. కశ్మీర్ విషయంలో ట్రంప్ను ప్రశంసిస్తూ "ఎవరూ ఊహించని విధంగా కొందరిని చర్చల టేబుల్ వద్దకు తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి ఆయన. ఆయన ప్రణాళికల గురించి నేను మాట్లాడలేను, కానీ ఆయన స్వభావం ప్రపంచానికి తెలుసు" అని అన్నారు. గత నెలలో భారత్, పాకిస్థాన్ మధ్య నాలుగు రోజులపాటు జరిగిన ఘర్షణల్లో కాల్పుల విరమణకు అమెరికానే మధ్యవర్తిత్వం వహించిందన్న వాదనను కూడా ఆమె పునరుద్ఘాటించారు. ఈ వాదనను భారత్ ఇప్పటికే ఖండించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ల వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. అయితే, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ వాదనలను తోసిపుచ్చారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక స్థాయిలో సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. "ఆపరేషన్ సిందూర్"లో భారత సైనిక బలమే పాకిస్థాన్ను కాల్పుల విరమణకు అంగీకరించేలా చేసిందని జైస్వాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #Indian #Gold #AmericaWomen #Fakejewellery #Rajasthanica
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.